Thursday, April 25, 2024

సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తున్నాడా? ఇందులో నిజమెంత?

పేదల దేవుడు సోనూసూద్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 2022లో బృహన్ ముంబై ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా సోనూసూద్ దిగబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. మేయర్ అభ్యర్థిని చాలా ముందుగానే ప్రకటించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి రేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్ కొడుకు, నటుడు రితేష్ దేశ్‌ముఖ్, మోడల్, ఫిట్‌నెస్ పర్సనాల్టీ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఉన్నట్లు తెలిసింది.

ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహాత్మక డాక్యుమెంట్‌లో పేర్లు ఉన్న ఈ ముగ్గురూ కాంగ్రెస్ సభ్యులు కారు. సిటీ కాంగ్రెస్ కార్యదర్శి గణేశ్ యాదవ్… 25 పేజీల స్ట్రాటజీ డాక్యుమెంట్ డ్రాఫ్టును రూపొందించారు. దాన్ని ఇంకా పార్టీ నేతల ముందు ప్రవేశ పెట్టలేదు. కొన్ని రోజుల్లో మహారాష్ట్ర ఏఐసీసీ సెక్రటరీ ఇంఛార్జి హెచ్ కే పాటిల్ ముందు దీన్ని ప్రవేశ పెడతారని సమాచారం. కాగా ఈ అంశంపై సోనూసూద్ స్పందించారు. ‘ఇది నిజం కాదు. సాధారణ వ్యక్తిగా నేను సంతోషంగా ఉన్నాను’ అని బదులిచ్చారు. అయితే లక్షలాది మందికి సాయం చేస్తున్న సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని కొందరు.. ఈ బురదలోకి ఆయన రావొద్దంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 67వేలకు పైగా ఉద్యోగాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement