Wednesday, May 1, 2024

టీలో విషం కలిపి ఇచ్చిన కోడలు.. ఓ చిన్నారి మృతి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. అత్తింటి కుటుంబంపై కక్ష పెంచుకున్న ఓ కోడలి కోపం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. బహ్రాయిచ్‌లో అనిత, పూరన్​ దంపతులు. వీరికి గతేడాది డిసెంబర్​లో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలలకే అత్తింటివారిపై అనిత కోపం పెంచుకుంది.

అయితే సోమవారం భర్త.. ఇంట్లో లేనప్పుడు.. విషం కలిపిన టీని అందరికీ అందించింది. టీని సేవించిన అనిత మామయ్య పంచమ్ జైశ్వాల్, మరిది జితేంద్ర, వదిన శివాని, కోడలు సృష్టి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శివాని కుమారుడు శివనాథ్(18 నెలలు) మాత్రం మృతి చెందినట్లు బహ్రాయిచ్ అదనపు ఎస్పీ కున్వార్ జ్ఞానాంజయ్ సింగ్ తెలిపారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనితను అదుపులోకి తీసుకున్నామని వివరించారు.

ఈ వార్త కూడా చదవండి: ఇకపై ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement