Saturday, May 4, 2024

ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కి ప్ర‌భాస్ ఫ్యాన్ ట్వీట్ – ప్రాజెక్ట్ కె గురించి అప్ డేట్

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ‘ప్రాజెక్ట్ కె చిత్రంలో న‌టిస్తున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. అయితే, చిత్ర బృందం నుంచి ఎలాంటి అప్ డేట్లు లేకపోవడంతో ప్రభాస్ అభిమాని ఒకరు చొరవచేసి దర్శకుడు నాగ్ అశ్విన్ కు ట్వీట్ చేశారు. గతంలో “రాధేశ్యామ్ విడుదల తర్వాతే అప్ డేట్లు” అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ ను ప్రస్తావిస్తూ “అన్నా గుర్తున్నామా” అంటూ అడిగారు. అందుకు నాగ్ అశ్విన్ “గుర్తున్నారు” అంటూ స్పందించడం విశేషం. అంతేకాదు, ‘ప్రాజెక్ట్ కె’ వివరాలను సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నారు. ఇప్పుడు ఒక షెడ్యూల్ పూర్తయింది. అందులో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ కూడా ఉంది. అందులో ప్రభాస్ ఎంతో కూల్ గా కనిపిస్తాడు. జూన్ చివరి వారం నుంచి మళ్లీ షూటింగ్ ప్రారంభమవుతుంది. రిలీజ్ విషయానికొస్తే ఆ లిస్టులో మనం లాస్టు కదా… కాబట్టి, మరెన్నో అప్ డేట్లు ఇవ్వడానికి బోలెడంత టైముంది. ప్రాజెక్ట్ కె చిత్రం కోసం అందరం ప్రాణం పెట్టి పనిచేస్తున్నామ‌ని నాగ్ అశ్విన్ తన ట్వీట్ లో వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement