Wednesday, May 1, 2024

గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా వాయిదా పడిన మెడికల్‌ పరీక్షలు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: గణేష్‌ నిమజ్జనం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం నాడు జరుగాల్సిన పలు పరీక్షలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వాయిదా వేసింది. ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ఈ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి వెల్లడించారు. ఎంబీబీఎస్‌ రెండవ సంవత్సరం, బీడీఎస్‌ చివరి సంవత్సరం, పోస్టు బేసిక్‌ నర్సింగ్‌ మొదటి సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

వాయిదా పడిన ఎంబీబీఎస్‌ మైక్రోబయాలజీ పరీక్ష ఈనెల 19న, బీడీఎస్‌ పెరియోడోంటోలాజీ పరీక్ష 21న పోస్టు బేసింగ్‌ నర్సింగ్‌ పరీక్ష 30న నిర్వహించనున్నట్లు తెలిపారు. 12 నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ యధావిధిగా జరుగుతాయని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement