Thursday, May 16, 2024

బాలయ్య ‘అఖండ’ డైలాగ్ వెనుక పొలిటికల్ హీట్ !!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ని దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచింది. అయితే ఈ టీజర్ లో బాలయ్య కాలు దువ్వె నంది ముందు రంగుమార్చిన పంది…కారుకుతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అంటూ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ చెప్పాడు.

ఇక ఈ డైలాగ్ విన్నవారంత కూడా దీనికి అర్థం తెలియక తలలు పట్టుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ డైలాగ్ కి అర్థం చెబుతున్నారు. రంగులు మార్చే పంది అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వేరొక పార్టీలోకి జాయిన్ అయిన నాయకులను తిడుతూ కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది అని హెచ్చరించాడు అంటూ నెటిజన్లు అభిమానులు చెప్పుకుంటున్నారు. మరి కొంతమంది అభిమానులు మాత్రం కథకనుగుణంగా గెటప్ ని బట్టి బాలయ్య డైలాగ్ చెప్పారు తప్ప మరింకేమీ లేదంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో బోయపాటికి బాలయ్యకె తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement