Sunday, April 28, 2024

పోలీసుల మంద‌లింపు – సెల్ ట‌వ‌ర్ ఎక్కిన స‌మ్మ‌య్య‌

మహాదేవపూర్( ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో బెల్ట్ షాప్ పంచాయతీ ఒక వ్యక్తిని సెల్ ఫోన్ టవర్ ఎక్కించేలా చేసింది. వివరలలోకి వెళ్తే.. మండల కేంద్రానికి చెందిన కొక్కు సమ్మయ్య బెల్ట్ షాప్ నిర్వహణ చేస్తున్నారని, మంథనిఎమ్మెల్యే పిఆర్వో పోలీసులకు సమాచారం ఇచ్చారని ..త‌నను అకారణంగా పోలీసులు మందలించారని మనస్థాపానికి గురై సమ్మయ్య సెల్ ఫోన్ టవర్ ఎక్కారు. దాదాపు మూడు గంటలపాటు టవర్ పైన ఉన్నారు స్థానిక ఎస్సై రాజు కుమార్ నచ్చచెప్పి కిందికి దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement