Saturday, April 27, 2024

షిరిడీ సాయి సన్నిధిలో పైలట్​ రోహిత్​రెడ్డి.. బాబా తీర్థ ప్రసాదాలు అందజేసిన సంస్థాన్​

షిరిడీ (ప్రభ న్యూస్​): తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​రెడ్డి ఇవ్వాల (సోమవారం) మహారాష్ట్రలోని షిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు. రోహిత్ రెడ్డికి సాయిబాబా సంస్థాన్ తరఫున బాబా వారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్​ఎస్​ పార్టీ తరఫున రోహిత్​రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఆయనకు కేటాయించిన చుండూరు మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఆ మండలంలోని పలు గ్రామాల నుంచి టీఆర్​ఎస్​ పార్టీలో చేరికలు పెరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement