Thursday, May 16, 2024

శ‌బ‌రిమ‌ల‌కు పోటెత్తిన భక్తులు… వర్చువల్ క్యూ పరిమితి తగ్గింపు

శబరిమల అప్పయ్య దర్శనం కోసం వర్చువల్ క్యూ బుకింగ్ పరిమితిని 80,000కి తగ్గించారు. ప్రస్తుతం బుకింగ్ పరిమితి 90,000 కాగా భక్తుల రద్దీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం, మత శాఖ మంత్రి, దేవస్థానం బోర్డు అధ్యక్షుడు సంయుక్తంగా సంప్రదింపులు జరిపి బుకింగ్ పరిమితిని తగ్గించాలని నిర్ణయించారు. అయితే ముందుగా ఏర్పాటు చేసిన ప్రదేశాలలో అయ్యప్ప భక్తుల కోసం స్పాట్ బుకింగ్ సౌకర్యం ఉంటుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రెసిడెంట్ పి.ఎస్.ప్రశాంత్ తెలిపారు.

శబరిమలకు వచ్చే భక్తుల కోసం నిలక్కల్, పంపా, సన్నిధానంలో అన్ని మౌలిక వసతులు కల్పించారు. యాత్రికులు వచ్చే ప్రదేశాలలో బాత్రూం, టాయిలెట్, యూరినల్ సౌకర్యాలు, బయో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. సకాలంలో వైద్యం అందిస్తోంది కేరళ ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement