Tuesday, May 7, 2024

Delhi | కేసీఆర్ అబద్ధాలను జనం నమ్మే పరిస్థితి లేదు : వీహెచ్ !

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే. చంద్రశేఖర రావు జైలుకు వెళ్లే పరిస్థితి త్వరలోనే వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు (వీహెచ్) అన్నారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన వీహెచ్, కాళేశ్వరం సహా సాగునీటి ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేశారని ఆరోపించారు.

కేసీఆర్ ప్రోద్బలంతో అధికారులు తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజలతో సంబంధాలు కోల్పోయారని, అందుకే ప్రజలు కూడా దూరం పెట్టారని అన్నారు. కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ నేతలకు కూడా ఓపిక లేదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలైనా కాకకముందే విమర్శలు మొదలుపెట్టారని అన్నారు. కేసీఆర్ చెప్పే అబద్ధాలు, కల్లిబొల్లి కబుర్లను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని వీహెచ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నల్గొండలో కాకపోతే మరెక్కడ సభ పెట్టుకున్నా తమకు ఎలాంటి భయం లేదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement