Tuesday, April 30, 2024

IND vs ENG : అశ్వీన్ ఎంత ప‌నిచేశావ్‌… పెనాల్టీ కింద ఇంగ్లండ్‌కు 5 ప‌రుగులు…

రాజ్‌కోట్ టెస్టులో టీమిండియాకు ఊహించిన విధంగా పెనాల్టీ పడింది. అంపైర్ జోయ‌ల్ విల్స‌న్ రోహిత్ సేన‌కు 5 ప‌రుగుల జరిమానా విధించాడు. భార‌త జ‌ట్టు ఇన్నింగ్స్ 102వ ఓవ‌ర్‌లో అంపైర్ విల్స‌న్ పెనాల్టీ కింద ఇంగ్లండ్ 5 ప‌రుగులు ప్ర‌క‌టించాడు.

అత‌డు సిగ్నల్ ఇవ్వ‌డం చూసిన అశ్విన్‌కు ఒక్క‌సారి ఏం జ‌రిగిందో అర్థం కాలేదు. దాంతో, అత‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మాట్లాడాడు. ర‌న్ తీసే క్ర‌మంలో పిచ్ మీదుగా ప‌రిగెత్తినందున పెనాల్టీ విధిస్తున్నట్టు విల్స‌న్ తెలిపాడు. మొద‌టి రోజు కూడా అంపైర్ పెనాల్టీ గురించి వార్నింగ్ ఇచ్చాడు. మ‌ళ్లీ అదే పొరపాటును భారత ఆట‌గాళ్లు రెండో రోజు కూడా చేయ‌డంతో అత‌డు ఇంగ్లండ్‌కు 5 ప‌రుగులు ఇచ్చాడు. దాంతో, బెన్ స్టోక్స్ సేన‌ తొలి ఇన్నింగ్స్‌ను 5\0తో ఆరంభించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement