Monday, April 29, 2024

చంద్రబాబుకు సవాల్ విసిరిన మంత్రి పెద్దిరెడ్డి

తిరుపతి ఉప ఎన్నిక నేప‌థ్యంలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆ మూడు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉంద‌ని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఈ ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి ఓడిపోతే త‌మ‌ 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని.. ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌లో టీడీపీ అభ్య‌ర్థి ఓడిపోతే టీడీపీకి చెందిన‌ ఎంపీలతో పాటు రఘురామ కృష్ణంరాజుతో రాజీనామా చేయించాల‌ని స‌వాల్ చేశారు. కాగా, తిరుప‌తి ఉప ఎన్నిక‌లో సీఎం జ‌గ‌న్ ప్ర‌చార‌ స‌భ ర‌ద్ద‌యిన విష‌యంపై పెద్దిరెడ్డి స్పందిస్తూ.. క‌రోనా వ్యాప్తి కారణంగానే ఆ సభను రద్దు చేసిన‌ట్లు చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్టుగా పెద్దిరెడ్డి అభివ‌ర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement