Thursday, April 25, 2024

క్యూలైన్ లో ఎమ్మెల్యే దాసరి .. ఓటు వేసిన మున్సిపల్ చైర్మన్

పెద్ద‌ప‌ల్లి ప్ర‌భన్యూస్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఓటు వేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే ,ఇతర ప్రజాప్రతినిధుల మాదిరిగానే ఆయ‌న క్యూ లైన్ లో నిలబడ్డారు. కాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమతప్రశాంత్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మహిళా ప్రజా ప్రతినిధులతో కలిసి వచ్చి ఓటు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement