Friday, April 19, 2024

Tirumala: శ్రీవారికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళం..

తిరుమ‌ల శ్రీ‌వారికి ఓ అజ్ఞాత భక్తుడు అరుదైన ఆభరణాన్ని విరాళంగా అందించాడు. స్వామి వారికి ఎంతో భక్తితో చేయించిన బంగారు కటి, వరద హస్తాలను శుక్ర‌వారం ఉదయం వీఐపీ విరామ సమయంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందించారు అజ్ఞాత దాత. ఆలయంలోని మూల విరాట్ కు అలంకరించేలా ఈ ఆభరణాలను ప్రత్యేకంగా చేయించారు.

5.5 కిలోల బరువు గల బంగారు హస్తాల తయారీకి రూ 3.5 కోట్ల విలువ ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. శ్రీవారికి స్వర్ణ కటి, వరద హస్తాలను అలంకరించనుట్టు ఆలయ అర్చకులు తెలిపారు. భక్తితో చేసిన విరాళ‌మ‌ని, ప్రచారం అవసరం లేదంటూ దాత కోరడంతో అత‌డి సమాచారాన్ని గోప్యంగా ఉంచింది టీటీడీ.

Advertisement

తాజా వార్తలు

Advertisement