Thursday, May 2, 2024

పంజాబ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సిద్దూ..

పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ గా మాజీ క్రికెటర్ నమజ్యోత్ సింగ్ సిద్దూ బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్‌తో రాజీ ఫార్ములా ప్ర‌కారం రాష్ట్ర పీసీసీ చీఫ్‌గా సిద్ధూ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గా ఈ కార్య‌క్ర‌మానికి త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే ఎమ్మెల్యేల‌తో కలిసి కెప్టెన్ సింగ్ హాజ‌ర‌య్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాల ప‌ర్వానికి తెర‌దించాల‌న్న హైక‌మాండ్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఈ కార్య‌క్ర‌మానికి పంజాబ్ పార్టీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ హ‌రీష్ రావ‌త్ కూడా హాజ‌ర‌య్యారు. త‌న ప్ర‌మాణ స్వీకారానికి రావాల్సిందిగా సిద్ధూ పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్‌కు రాసిన లేఖ‌లో కోరార‌ని పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు పంజాబ్ సంక్షోభం ముగిసిపోయింద‌ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాగా ఈ కార్యక్రమానికి వెళుతూ ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాదవశాత్తు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement