Sunday, April 28, 2024

టిడిపి అధ్య‌క్షుడు వెన్నా బాల‌కోటిరెడ్డిపై హ‌త్యాయ‌త్నం-తీవ్ర‌గాయాలు

పల్నాడు జిల్లా : రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి పై హత్యాయత్నం జ‌రిగింది. అలవల గ్రామంలో మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో గొడ్డళ్లతో దాడి చేశారు ప్రత్యర్థులు.ఈ ఘ‌ట‌న‌లో బాలకోటి రెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి.దాంతో అత‌నిని నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు.గతంలో రొంపిచర్ల ఎంపీపీగా పని చేశారు వెన్నబాల‌ కోటిరెడ్డి.
దాడికి పాల్పడింది రొంపిచర్ల వైసిపి ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావు. ఆసుపత్రిలో బాలకోటిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా..చదలవాడ అరవిందబాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement