Thursday, May 9, 2024

అభివృద్ధికి ఆటంకంగా ప్రతిపక్షాలు.. దుష్ట రాజకీయాలతో అడ్డంకులు, ప్రధాని మోదీ ఆరోపణ

సమాజం, దేశం ప్రయోజనాల కంటే తమ రాజకీయ ప్రయోజనాలే ప్రధానమని ప్రతిపక్షాలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు హర్మోహన్ 10వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను అమలు చేయలేక పోయాయి. కానీ, ఇప్పుడు తమ  ప్రభుత్వం చేస్తున్న పనులకు అడ్డంకులు తెస్తున్నాయన్నారు.

అప్పట్లో వారు తీసుకున్న నిర్ణయాలు అమలు చేయలేదు. అవే నిర్ణయాలను ఇప్పుడు అమలు చేస్తుంటే దానిని వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇట్లాంటి రాజకీయాలను దేశ ప్రజలు ఇష్టపడరని ప్రధాని అన్నారు. దేశ కొత్త అధ్యక్షురాలిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన సమాజానికి చెందిన మహిళ దేశానికి నాయకత్వం వహించబోతున్నారు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement