Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో వన్‌ వెూటో..

కొత్త సంవత్సరంలో తెలంగాణకు తొలి పెట్టుబడి వచ్చిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. వన్‌మోటో ఎలక్ట్రిక్‌ కంపెనీ తన ఎలక్ట్రిక్‌ టూ వీలర్ల తయారీ కేంద్రాన్ని హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో వన్‌మోటో ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ వాహనాలను జయేశ్‌రంజన్ నిన్న ఆవిష్కరించారు. ఈ తయారీ కేంద్రంలో కంపెనీల రెట్రో, క్లాసిక్‌ రకాల టూ వీలర్లు తయారు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో తొలి బ్యాటరీ స్వాపింగ్‌ యూనిట్‌ ప్రారంభం..

ప్రముఖ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ హెచ్‌పీసీఎల్‌ భాగస్వామ్యంతో రేస్‌ ఎనర్జీ అనే కంపెనీ హైదరాబాద్‌లో తన తొలి బ్యాటరీ స్వాపింగ్‌ యూనిట్‌ను ప్రారంభించింది. విద్యుత్‌ వాహనాలు బ్యాటరీ మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ యూనిట్‌ను నిన్న ఈ యూనిట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement