Thursday, May 16, 2024

ఒక్కరోజు పోలీస్ కమిషనర్ ఇక లేడు

పదేళ్ల వయసులో హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు పోలీస్ కమిషనర్‌గా పని చేసిన సాదిఖ్‌ బుధవారం కరీంనగర్‌ సమీపంలోని రేకుర్తిలో కన్నుమూశాడు. సుదీర్ఘ కాలంగా రక్త కేన్సర్‌తో (లుకేమియా) బాధపడుతున్న బాలుడి వయసు ప్రస్తుతం 17 ఏళ్లు అని తండ్రి జావేద్‌ బాషా తెలిపారు. సాదిఖ్‌కు పోలీసు ఉద్యోగం అంటే మక్కువ. ఈ నేపథ్యంలోనే ‘మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌’ అతడి కోరిక తీర్చడంపై దృష్టి పెట్టింది. ప్రభుత్వ అనుమతి తీసుకున్న ఈ సంస్థ 2014 అక్టోబర్‌ 15న సాదిఖ్‌ను హైదరాబాద్‌ నగరానికి ఒక రోజు కమిషనర్‌గా చేసింది. అప్పట్లో నగర కొత్వాల్‌గా ఉన్న ఎం.మహేందర్‌రెడ్డి నుంచి సాదిఖ్‌ ఈ బాధ్యతలు స్వీకరించాడు. కాగా సాదిఖ్‌‌ను కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బుధవారం స్వగ్రామంలో అతడు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement