Saturday, May 4, 2024

కిడ్నీ ఇన్ఫెక్ష‌న్ తో బాధ‌ప‌డుతున్నా.. పాయ‌ల్ రాజ్ పుత్

రీసెంట్ గా జిన్నా చిత్రంతో అల‌రించింది హీరోయిన్ పాయ‌ల్ రాజ్ పుత్. తమిళంలో ఆమె నటించిన ‘గోల్ మాల్’ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అలాగే ‘ఏంజెల్’, ‘కిరాతక’ సినిమాల్లో నటిస్తోంది. డైరెక్టర్ అజయ్ భూపతి రీసెంట్ గా అనౌన్స్ చేసిన ‘మంగళవారం’ చిత్రంలోనూ పాయల్ రాజ్ పుత్ నటించబోతుందని ప్రచారం జరుగుతోంది.కాగా పాయల్ రాజ్ పుత్ కిడ్నీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు తెలిపింది. కొద్దిరోజులుగా ఈ డిసీజ్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నానని తెలిపారు. ఇంట్లోనే సెలైన్ పెట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ హెల్త్ పై అప్డేట్ అందించింది.ఈమేరకు ఓ నోట్ కూడా రాసుకొచ్చింది. నేను చాలా తక్కువ నీరు తాగేదాన్ని. దాంతో కిడ్నీ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఫలితంగా కాస్తా అనారోగ్యానికి గురయ్యాను. ప్రస్తుతం ట్రీట్ మెంట్ ముగిసింది. యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్‌ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. రోడ్‌బ్లాక్‌లు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలి. నా రాబోయే ప్రాజెక్ట్ కోసం షూటింగ్‌ని ఆపలేకపోయాను. షో మస్ట్ గో ఆన్. ఈసారి బిగ్గర్ అండ్ బెటర్ గా ఉంటుంది. మీరందరూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నారు. జాగ్రత్తా’ అంటూ తన ఆరోగ్యం గురించి తెలుపుతూ అభిమానులకు పలు సూచనలు చేసింది.ఉన్నట్టుుండి పాయల్ తన హెల్త్ పై ఇలా అప్డేట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. తన చేతికి సెలైన్ నిడిల్ చూసి తట్టుకోలేకపోతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం పాయల్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement