Saturday, May 4, 2024

ఒడియా నటుడు రాయ్​మోహన్ ఆత్మహత్య.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రముఖ ఒడియా నటుడు, జాత్రా కళాకారుడు రాయ్​మోహన్ పరిదా (58) ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం భువనేశ్వర్‌లోని ప్రాచీ విహార్‌లోని తన ఇంట్లో ఊరేసుకుని చనిపోయాడు. ఈ వార్త తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం క్యాపిటల్‌ ఆస్పత్రికి తరలించారు. నటుడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియలేదు. దీనిపై విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు పోలీసు అధికారులు తెలిపారు. కాగా, రాయ్‌మోహన్‌ మరణవార్తతో ఒడియా సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది.

ఈ వార్త తెలియగానే వందలాది మంది ఒడియా నటులు, సహనటులు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. నెగెటివ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న రాయ్​మోహన్ పరిదా స్వస్థలం కియోంజర్ జిల్లా. జూలై 10, 1963న జన్మించారు ఆయన. 100కి పైగా ఒడియా, బెంగాలీ చిత్రాల్లో నటించారు. సింఘబహిని (1998), సునాభౌజా (1994), మెంటల్ (2014), ఇతర చిత్రాలలో తన నటనకు ప్రశంసలు అందుకున్నారు. రాయ్​మోహన్ పరిదాకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఒక కుమార్తె వివాహం కాగా, అతను ప్రాచీ విహార్‌లోని ఓ ఫ్లాట్‌లో భార్య, మరో కుమార్తెతో కలిసి ఉంటున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement