Thursday, May 2, 2024

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌ముఖ సినీ న‌టులు నంద‌మూరి తార‌క‌రామారావు నాలుగో కూతురు కంఠ‌మ‌నేని ఉమా మ‌హేశ్వ‌రి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనట్లు తెలిసింది. ఈ పరిణామాలే ఆత్మహత్యకు దారితీశాయని సమాచారం.

జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో ఉన్న బెడ్రూంలో ఉమా మహేశ్వరి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. ఆమె మృతికి కారణం ఆత్మహత్యగా తెలియడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్‌ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి అందకి కంటే చిన్న. చెల్లి కావడంతో ఆమెపై తోడ బుట్టిన వాళ్లు ఎనలేని అభిమానం చూపేవారు. ఉమా మహేశ్వరికి ఇద్దరు కుమార్తెలున్నారు. మరణంతో బాలకృష్ణ, చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement