Sunday, May 5, 2024

తెరమరుగు నటులకు ఓటీటీ చేయూత.. వెబ్ సిరీస్ లో అవ‌కాశాలు..!

సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతే నటీనటుల పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. కొందరికీ టీవీ ఛాన్స్‌లు లభిస్తే, మరికొందరికీ అవీకూడా ఉండవు. అలాంటప్పుడు రిటర్మెంట్‌ తప్పదు. కానీ ఇప్పుడు అలా కాదు అలాంటి వారికి వెబ్‌ సిరీస్‌ ఆహ్వానం పలుకుతున్నాయి. కనుమురుగైన నటీ నటులకు ఓటీటీ అనేది వరంగా మారింది. సినిమాల్లో ఆఫర్లు రాని వారు.. సినిమా అవకాశాలు లేక నిరాదరణకు గురవుతున్న వారికి ఇప్పుడు వారిని గుర్తింపి ఓటీటీలు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నాయి. మంచి పారితోషికంతో పాటుగా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. మేకింగ్‌ సినిమా తరహాలోనే ఉంటుంది కాబట్టి ఆర్టిస్టులు కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పలు చిత్రాల్లో నటించి మధ్యలో గ్యాప్‌ తీసుకున్న నటి లయ ఈ మధ్య మళ్లీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరువ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది సీనియర్‌ హీరోయిన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా జనాల్లో ఉంటున్నారు. ఇదంతా మేకర్స్‌ దృష్టిలో పడేందుకే. ఇప్పటికే చాలా మంది ఈ విధంగా అవకాశాలు దక్కించుకుని ఓటీటీలో కనిపిస్తున్నారు.
అక్కినేని హీరో సుశాంత్‌ సైతం ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఒకప్పటి హీరో ఆర్యన్‌ రాజేష్‌ సైతం వెబ్‌ సిరీస్‌ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు.

నిహారిక కొణిదెల నిర్మిస్తున్న హలో వరల్డ్‌ అనే వెబ్‌సిరీస్‌లో ఆర్యన్‌ రాజేష్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌ను చాలా విభిన్నంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌లో పలువురు నటీ నటులు కనిపించబోతున్నారు. అందరూ సినిమాల్లో ప్రయత్నాలు చేసి విఫలం అయిన వారే. జయం హీరోయిన్‌ సదా కూడా హలో వరల్డ్‌ అంటూ పలకరించేందుకుగాను ప్రయత్నాలు చేస్తోంది. ఫేడవుట్‌ స్టార్స్‌ ఇంకా ఎంతో మంది ఏదో ఒక మార్గం ద్వారా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఎక్కువ శాతం మంది ఓటీటీలో అవకాశాలు దక్కించుకుంటూ బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement