రవీంద్రభారతి, (ప్రభన్యూస్) : మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రవీంద్రభారతిలో ఎన్టీఆర్ సాంస్కృతిక వైభవ మహోత్సవం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రావు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎన్టీఆర్ నటుడిగా, నాయకుడిగా ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశా రన్నారు.
అలాంటి మహనీయుని శతజయంతి ఉత్సవాలను రసమయి సంస్థ ఆధ్వర్యంలో జరగడం అభినందనీయమన్నారు. సంస్థ అధినేత డాక్టర్ ఎంకె రాము, ఎన్టీఆర్ పై రచించిన పుస్తకం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి సముద్రాల వేణు గోపాలచారి,రిటైర్డ్ ఐఏఎస్ లక్ష్మీకాంతం,రిటైర్డ్ ఐఆర్ఎస్ నరసింహ అప్ప , ఏపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ , టీడీపీ మహిళా నేత నన్నపనేని రాజకుమారి , ప్రముఖ చిత్ర నిర్మాత నాగబాల సురేష్ పాల్గొన్నారు .
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..