Saturday, May 4, 2024

లా అడ్మిషన్‌ టెస్టులో ఎన్టీఆర్‌ కాలేజీ విద్యార్థినుల ప్రతిభ.. జాతీయ స్థాయిలో 20 ర్యాంకులు కైవసం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టులో ఎన్టీఆర్‌ మహిళా జూనియర్‌ అండ్‌ డిగ్రీ కాలేజీ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జాతీయస్థాయిలో 20కు పైగా ర్యాంకులను సాధించారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో మొదటి, ద్వితీయ సంవత్సరంలో మొదటి పది ర్యాంకులను సాధించారు. ఏపీ లాసెట్‌లో హరిత శ్రీ రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకును సాధించారు. ఈ సందర్భంగా హరితశ్రీని మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement