Friday, May 3, 2024

అంబులెన్సులకు అనుమతి.. వాహనాలకు నో పర్మిషన్

తెలంగాణలో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలను ఉదయం 10 గంటల తర్వాత తెలంగాణలోకి అనుమతించట్లేదు. బస్సులు, ప్రైవేట్ వాహనాలను సరిహద్దుల వద్ద నిలిపివేస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా వేటికీ పర్మిషన్ లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఏపీ నుంచి కరోనా రోగులతో హైదరాబాద్ వస్తున్న అంబులెన్సులకు అనుమతి ఇస్తున్నారు. అటు ఏపీ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి కూడా ఇంటర్ స్టేట్‌బస్ సర్వీసులు, ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణాలను అనుమతించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement