Thursday, May 16, 2024

Delhi | ఏపీలో బడ్జెటేతర అప్పులు రూ.79,815 కోట్లు: కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ బడ్జెటేతర అప్పులు రూ.79,815 కోట్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ అప్పులపై కేంద్ర ఆర్థిక శాఖ మరోసారి వివరాలు ప్రకటించింది. 2021-22, 2022-23లకుగానూ రూ. 70 వేల కోట్లకు పైగా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు గ్యారంటీ ఇచ్చినట్లు తెలుగుదేశం సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తమకు నివేదించిందని అన్నారు. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు గ్యారంటీ ఇస్తే. అవి రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను వివరిస్తూ 2022 మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పంకజ్ చౌదరి వివరించారు. అంతకు ముందు రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి రూ. 29,183 కోట్లు అప్పు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement