Saturday, May 4, 2024

కామారెడ్డి – మేం చెప్పేవ‌ర‌కూ నో మాస్ట‌ర్ ప్లాన్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: పట్టణీకరణ అభివృద్ధి, విస్తరణ నేప థ్యంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌లపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇక నుంచి మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలన్నా, అమలు చేయాలన్నా… ఆ ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను ముందగా కోర్టుకు వివరించాలని, మేం చెప్పేంతవరకూ ముందడుగు వేయవద్దని ప్పష్టమైన ఆదేశాలిచ్చింది. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివా దంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ధర్మాసం విచారణ చేపట్టింది. కాగా, విచారణ సంద ర్భంగా కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను హోల్డ్‌లో పెట్టామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నగర ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసు కుని నిలిపివేశామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే స్పందించిన సీజే ధర్మాసనం ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించింది. అయితే ఇక నుంచి హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్‌ ప్లాన్‌పై ముందుకు వెళ్లవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేప థ్యంలో కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ అంశానికి సంబంధించి సింగిల్‌ బెంచ్‌లో ఉన్న మరో పిటిషన్‌ను డివిజన్‌ బెంచ్‌లో ఇంప్లీడ్‌ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేసింది.
అయితే దీనికి సంబంధించిన గత విచారణలో కేఏ పాల్‌ వాదనలు వినిపిస్తూ మాస్టర్‌ ప్లాన్‌ కారణంగా ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకు న్నాడని చెప్పారు. కాగా.. ఒక ఎకరం లేదా అంతకంటే తక్కువ ఉన్న దాదాపు రెండు వేల మంది సన్నకారు రైతులు జీవనోపాధి లేక ఇబ్బం దులు పడుతున్నారని వారి అభిప్రాయాలు తీసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా మాస్టర్‌ ప్లాన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆరోపించారు. అంతే కాకుండా.. ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారని తెలిపారు. ఇక ప్రభుత్వ అధికారులు, జిల్లా కలెక్టర్‌ నియంతలుగా వ్యవహరిస్తున్నారని పాల్‌ కోర్టుకు విన్నవించారు.

మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం: కామారెడ్డి మున్సిపల్‌ న్యాయవాది
ఇక మరోవైపు ప్రతిపాదిత మాస్టర్‌ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని పురపాలక సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మా నాన్ని సమర్పించిందని కామారెడ్డి మున్సిపాలిటీ- తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, ఈ వాదనలపై కేఏ పాల్‌ స్పందిస్తూ డ్రాప్ట్‌ మాస్టర్‌ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడానికి లేదా రద్దు చేయడానికి మున్సిపా లిటీ-కి ఎటు-వంటి అధికారాలు లేవని వాదించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రాష్ట్ర ప్రభుత్వం తమ వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆదేశించిన హైకోర్టు విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

ఇంతకు ముందు జరిగిందిలా…
ఈ క్రమంలోనే నేడు హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఏం జరి గింది? కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనలను ప్రతిపక్షాలు కూడా మద్దతుగా నిలిచాయి. మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలోనే మున్సిపల్‌ కార్యవర్గం అత్యవసర సమావేశం నిర్వహించి ముసాయిదాను రద్దు చేసింది. దీంతో.. మాస్టర్‌ ప్లాన్‌ రద్దు తీర్మానాన్ని కౌన్సిలర్లంతా ఆమోదించారు. ఈ డిజైన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను ఉపసంహరించుకోవాలని కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో నిర్ణయిం చినట్లు- కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌ జాహ్నవి తెలిపారు. అంతేకాకుండా.. రైతుల భూముల్లో పారిశ్రామిక జోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని జాహ్నవి స్పష్టం చేశారు.

హైకోర్టు ఎదుట కేఏ పాల్‌ ప్లెక్సీ
కామారెడ్డి రైతులకు న్యాయం చేసిన చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ తుకారం, డాక్టర్‌ కేఏ పాల్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ తెలంగాణ హైకోర్టు ఎదుట కామారెడ్డి రైతులు ప్లెక్సీని ప్రదర్శించడం హాట్‌ టాపిక్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement