Saturday, May 4, 2024

నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి సీఎంలు వైఎస్ జగన్, మమతా బెనర్జీ, శివరాజ్ సింగ్ చౌహన్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. సమావేశం అజెండాలో ప్రత్యామ్నాయ పంటల సాగు, నూనె, పప్పుల పంటల సాగులో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం అమలు, పట్టణాభివృద్ధి, వివిధ రంగాలలో భారత్ ఆత్మ నిర్భర్ సాధించేందుకు కేంద్ర రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం జరుగుతోంది. కాగా ఈ సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement