Saturday, April 27, 2024

Iran-Pakistan: ఇరాన్ లో తొమ్మిది మంది పాకిస్థానీయులు కాల్చివేత‌…

ఇరాన్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్‌లో తొమ్మిది మంది పాకిస్థానీయులను కాల్చిచంపారు. పాకిస్థాన్‌పై ఇరాన్‌ దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్థాన్‌కు ఆనుకుని ఉన్న ఇరాన్‌లోని ఆగ్నేయ ప్రాంతంలో జరిగింది.

అయితే ఈ దాడికి ప్రస్తుతం ఏ సంస్థ బాధ్యత వహించలేదు. ఇటీవలే ఇరాన్‌-పాకిస్థాన్‌ల మధ్య వివాదం ముగిసిపోయినప్పటికీ ఈ ఘటన మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచింది. టెహ్రాన్‌లోని పాక్ రాయబారి ముహమ్మద్ ముదస్సిర్ టిపి ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సరవాన్‌లో 9 మంది పాకిస్థానీలు హత్యకు గురికావడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పారు.

ఈ విషయంలో సహకారం కోసం ఇరాన్‌కు విజ్ఞప్తి చేశామ‌న్నారు. సర్వాన్ నగరంలోని సిర్కాన్ ప్రాంతంలో హత్యకు గురైన వారంతా పాకిస్థాన్‌లోని పంజాబ్, సింధ్ ప్రావిన్స్ నివాసితులు. ఆటో రిపేర్ షాపులో పనిచేసేవాడు. ఈ దాడిలో ముగ్గురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement