Saturday, April 27, 2024

ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ హెచ్చరిక

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనంలో సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఫోటోలను ఎన్జీటీ పరిశీలన చేసింది. అయితే దీనిపై ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కరణకు ఆంధ్రప్రదేశ్ పాల్పడినట్లు అర్థం అవుతోందని ఎన్జీటీ వ్యాఖ్యానించింది. ధిక్కరణ కేసులో గతంలో అధికారులను జైలుకు పంపారా ? అని పేర్కొంది.

అధికారులను ఎన్జీటీ నేరుగా జైలుకు పంపవచ్చా? లేదా హైకోర్టు ద్వారా అధికారులను జైలుకు పంపాలా? అని ఎన్జీటీ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఇరువురు పిటిషనర్ల అభిప్రాయాన్ని కోరింది. అధికారులను శిక్షించిన సందర్భాలు ఎదురుకాలేదన్న ఎన్జీటీ.. పర్యావరణ శాఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుమ్మక్కైనట్లు అనిపిస్తోందని అభిప్రాయపడిందని వెల్లడించింది. కాగా ఇటీవలే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కేఆర్ఎంబీ పరిశీలించిన సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి: గుంటూరులో పొలిటికల్ హీట్.. నారా లోకేష్ అరెస్ట్

Advertisement

తాజా వార్తలు

Advertisement