Wednesday, May 15, 2024

కొత్తగా మరో 65 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మరో 65 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 10705 మందికి కరోనా టెస్టులు చేయగా 65 మందికి వైరస్‌ సోకినట్లు నిర్దారణ అయింది. మరో 46 మంది చికిత్స పొందుతూ వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికీ దాదాపు 582 మంది హోం ఐసోలేషన్‌ లేదంటే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌లో 35 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 19, సూర్యాపేట 3, సంగారెడ్డిలో రెం డు కేసులు నమోదయ్యాయి. కాగా… గోదావరి ఖనిలో తాజాగా ఓ కరోనా కేసు నమోదైంది. ఓ మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంత వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మహిళను ఐసోలేషన్‌కు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement