Saturday, May 4, 2024

టీడీపీలో కొత్త జోష్‌, రికార్డు సృస్టించిన ఒంగోలు మహానాడు.. రెట్టింపు ఉత్సాహంతో టీడీపీ శ్రేణులు

ఒంగోలు, ప్రభన్యూస్ : టీడీపీలో కొత్త రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ప్రాణం పోసిందా..? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దూకుడుతో దాదాపు అంపశయ్య పైకి చేరుకున్న టీడీపీలో కొత్త జోష్‌ నెలకొందా..? అధికారం మాట అటుంచి..ఇక టీడీపీ అంతరించిపోతుందనుకున్న సమయలో రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేసింది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఇక కదనరంగంలోకి కాలు పెట్టేసిందా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలికులు. ఈ నెల 27,28 తేదిల్లో ఒంగోలు సమీపంలోని మండవవారిపాలెం వద్ద సుమారుగా 100 ఎకరాల మైదానంలో టీడీపీ మహానాడు నిర్వహించారు. మొదటి, రెండవ రోజు టీడీపీ అంచనాలకు మించి విజయవంతమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార వైసీపీ కూడా ఈ స్థాయిలో మహానాడు విజయవంతమవుతుందని అంచనా వేయలేదని అంటున్నారు. చివరి రోజు అంటే 28వ తేది నిర్వహించిన సభకు దాదాపు మూడు లక్షలకు పైగా హాజరయ్యారని పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ ఇంత మంది హాజరు కాలేదని గుర్తు చేస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ ఆర్‌ జీవించి ఉన్నప్పుడు పెట్టిన మహానాడులకు కూడా ఈ స్థాయిలో ఆదరణ లేదని వాటి పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు.

జగన్‌ ప్రభుత్వం మహానాడుకు వెళ్లనీయకుండా వాహనాలను అడ్డుకోవడం, టైర్లలో గాలి తీసేయడం, మహానాడు జరిగే రోజుల్లోనే ఒంగోలులో రుతుస్రావ దినోత్సవాలు నిర్వహించడం, ఈ ఉత్సవాలకు డ్వాక్రా మహిళలు జగనన్న అమ్మఒడి అందుకుంటున్న వారు తప్పని సరిగా రావాలనే నిబంధనలు పెట్టడం, పోలీసులతో మహానాడుకు వచ్చే వారిని అడుగడుగునా అడ్డుకోవ డం వం టి వాటికి పాల్పడ్డా మహానాడుకు వెల్లువలా జనం తరలివచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడుకు జనం పోటెత్తడం..ఓ రకంగా తెలుగుదేశం పార్టీ మీద అనుకూలత కంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మీద ప్రజల్లో గూడు కట్టుకున్న వ్యతిరేకతకు నిదర్శమని చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం మీద రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో గూడుకట్టుకుని ఉన్న అసంతృప్తికి వ్యతిరేకంగా ..మహానాడు విజయానికి లింకు పెట్టి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతుండటం గమనార్హం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలను వేధించడం వారిని బూతులతో తిట్టించడం, ఇళ్లల్లోని మహిళలను , చిన్న పిల్లలను సైతం వదిలి పెట్టకుండా వారి పైన అస భ్య అభ్యంతకర వ్యాఖ్యలు చేయించడం ఇప్పటి వరకు రాజధానిని అతీగతీ లేకుండా చేయడం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ఇప్పటికీ పూర్తి కాకపోవడం, ప్రత్యేక హోదా ఉసే లేకపోవడం, ఒక్క పేరున్న కంపెనీ రాష్ట్రంలో ప్లాంట్‌ లేదా తమ యూనిట్‌ పెట్టకపోవడం, అస్సలు యూనిట్‌ సంగతి దేవుడెరుగు పెట్టుబడులు కూడా రాకపోవడం ఎన్నో దశాబ్ధాల క్రితం ఇళ్లు కట్టుకున్న వారి నుంచి వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో పది వేల రూపాయల చొప్పున డబ్బులు బాదడం, చెత్త పన్ను వసూళ్లు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలతో పేదల నడ్డి విరవడం, ఇసుక, మద్యం దోపిడీతో లక్షల కోట్ల రూపాయలు అర్జించడం, ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతున్న న్యాయమూర్తులను కూడా వదల కుండా వారి పైనా ఒంటి కాలి మీద లేవడం..ఇలా జగన్‌ మూడేళ్ల ప్రభుత్వం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందని నిపుణులు చెబుతున్నారు.

జగన్‌ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రం తీవ్ర ఆరి ్థక సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రూ.8లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని దివాలా అంచుకు చేర్చిందని ఆయా రంగాల నిపుణులు వివరిస్తున్నారు. పాత పథకాలకే కొత్త పేర్లు పెట్టి కొందరి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నా..ఆ పథకాలు అందనివారి సంఖ్య కూడా అంతే ఎక్కువ సంఖ్యలో ఉందని గుర్తు చేస్తున్నారు. మంత్రి పదవులు అంటూ కొంత మందికి ఇచి ్చనా బీసీల్లో ఉన్న ఒకటి రెండు ప్రధాన కులాలకే ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు..ముఖ్యంగా రోడ్లు ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే ఉన్నాయని పేర్కొంటున్నారు. ముఖ్యంగాప్రభుత్వ వైఫల్యాల పైన ప్రశ్నిస్తున్న చంద్రబాబు నాయుడిని ఆయన కుమారుడు నారా లోకేష్‌ల వ్యక్తిత్వాన్ని హననం చేయించడం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అసభ్య అభ్యంతకర వ్యాఖ్యలు చేయించడం, దానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో 13 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు కన్నీళ్లు పెట్టుకోవడం ప్రజలను కలచివేసిందని చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థి పార్టీల ను ఎదుర్కొవాలి గానీ.. ఇంట్లో భార్యలు..పసి పిల్లలైన కుమార్తెల పై కూడా అసభ్య వ్యాఖ్యలు చేయించడాన్ని ప్రజలు హర్షించలేకపోయారని అంటున్నారు. చంద్రబాబుకు తామున్నామని మద్దతు ఇవ్వడానికే ప్రజలు మహానాడుకు క్యూ కట్టారని వివరిస్తున్నారు. ఇలా అన్ని రూపాల్లో జగన్‌ ప్రభుత్వం పై గూడు కట్టుకున్న వ్యతిరేకతో రాష్ట్ర ప్రజలంతా అనుభవజ్ఞుడైన చంద్రబాబునాయుడు వైపు చూశారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే మహానాడుకు ప్రజలు వెల్లువలా తరలివచ్చి విజయవంతం చేశారని చెబుతున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో మహానాడు విజయం చాటి చెప్పిందని అంటున్నారు. ఇదే జోష్‌తో టీడీపీ వచ్చే రేండేళ్లు ముందుకు నడవాలని సూచిస్తున్నారు. ఈ రెండేళ్లు ప్రజా సమస్యల పై పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని.. ప్రజా ఉద్యమాలను నిర్మించాలని..అన్నిటికంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను కలిసి ఆయన మద్దతుతో అడుగులు వేయాలని టీడీపీకి సూచిస్తున్నారు. జనసేన, టీడీపీ ప్రభుత్వం మాత్రమే రాష్ట్ర ప్రజలు కోరుకునే అభివృద్ధిని, సమతుల్య సామాజిక న్యాయాన్ని, సుస్థిరాభివృద్ధిని నిజమైన ఆర్థికాభివృద్ధిని అందించగలదని ప్రజజలు నమ్ముతున్నారని రాజకీయాలను దగ్గరగా చూస్తున్న పరిశీలికులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ పై పెట్టుకున్న అశలను నెర వేర్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు నడుచుకోవాలని సూచిస్తున్నారు. మరో వైపు టీడీపీ మహానాడు అంచనాలకు మించి విజయం సాధించడంతో అధికార వైసీపీలో గుబులు మొదలైందని విశ్లేషకులు చెబుతున్నారు. మహానాడు సక్రమంగా జరగకుండా విజయవంతం కాకుండా ఉండటానికి అన్ని రకాల ఆటంకాలు కల్పించినా మహానాడు సక్సెస్‌ కావడంతో తీవ్ర అంతర్మథం చెందుతోంది. ఎందుకు ఎలా జరిగిందని వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మంతనాల్లో మునిగిపోయారని అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ విదేశాల నుంచి తిరిగివచ్చాక తమ ప్రభుత్వం పై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో వైసీపీ నేతలకు మహానాడు సక్సెస్‌ ద్వారా తెలిసివచ్చినట్టేనని విశ్లేషకులు చెబుతున్నారు. తాము లెక్కకు మిక్కిలిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా..టీడీపీ మహానాడుకు అన్ని లక్షల మంది జనం ఎందుకు హాజరయ్యారో తెలియక ఆ పార్టీ నేతలు బిత్తరచూపులు చూస్తున్నారని పేర్కొంటున్నారు.

కాగా, టీడీపీ మహానాడుకు దాదాపు 3లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యారని ఇంటెలిజెన్స్‌ ప్రభుత్వానికి ని వేదించినట్టు సమాచారం. అలాగే కొన్ని లక్షల మంది ప్రజలు ఫేస్‌బుక్‌ లైవ్‌ యూట్యూబ్‌ చానెళ్లు, వివిధ వార్తా చానెళ్ల ద్వారా మహానాడును వీక్షించారని స్వయంగా ఇంటెలిజెన్స్‌ నివేదించినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురు చూశారని చెబుతున్నారు. ఆయన ఏం మాట్లాడతారా..? పొత్తుల విషయంలో స్పష్టత ఇస్తారా..? వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారు? జగన్‌ ప్రభుత్వం పై ఎలా విరుచుపడతారు? అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూశారని పేర్కొంటున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement