Friday, April 26, 2024

పెళ్లిలకు వంద మంది మాత్రమే: కోవిడ్ కొత్త రూల్స్..

కరోనా కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కేసుల పెరుగుదల మాత్రం తగ్గడం లేదు. కరోనా కట్టడికి కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ఆంక్షలను విధించింది. బహిరంగ ప్రదేశాల్లో జరిగే పెళ్లిళ్లు, రాజకీయ వేడుకలకు 200 మందికి మించి హాజరు కాకూడదని షరతు విధించింది. క్లోజ్డ్ స్పేస్ లో పెళ్లిళ్లకు 100 మందికి మించి హాజరు కాకూడదని తెలిపింది.

పుట్టినరోజులు, ఇతర వేడుకలకు బహిరంగ ప్రదేశాల్లో అయితే 50 మంది, క్లోజ్డ్ ఏరియాల్లో అయితే 25 మందికి మించి హాజరు కాకూడదని షరతు విధించింది. మతపరమైన వేడుకలను పూర్తిగా నిషేధించినట్టు తెలిపింది. వేడుకలు జరిగే ప్రాంతాలను తప్పనిసరిగా శానిటైజ్ చేయాలని చీఫ్ సెక్రటరీ పి.రవికుమార్ తెలిపారు. ఈ ఆంక్షలను అందరూ పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని… ఆంక్షలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్, ఐపీసీ, ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోవాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement