Tuesday, April 30, 2024

National: రైల్వే అధికారుల నిర్ల‌క్ష్యం… డ్రైవ‌ర్ లేకుండానే ముందుకు క‌దిలిన రైలు…

జ‌మ్ముకశ్మీర్‌లో వింత ఘ‌ట‌న చోటుచేసుకుంది. డ్రైవ‌ర్ లేకుండా రైలు పురుగులు తీసింది. కథువా రైల్వే స్టేషన్‌లో అధికారులు నిర్లక్ష్యం మూల‌నా నిలిపి ఉంచిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా డ్రైవర్ లేకుండానే పఠాన్‌కోట్ వైపు పరుగులు తీసింది.

అధికారులు అప్రమత్తమై పంజాబ్‌లోని ఊంచీ బస్సీ సమీపంలో రైలును నిలిపివేశారు. దీనిపై విచారణ ప్రారంభించినట్లు జమ్ము డివిజనల్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు. పట్టాల వాలు కారణంగానే గూడ్సు రైలు ముందుకు కదిలినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement