Saturday, April 27, 2024

TS : నేషనల్ హైవేపై కారు బీభ‌త్సం.. ఒక‌రు మృతి, న‌లుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఇవాళ‌ కారు బీభత్సం సృష్టించింది. అదుపు త‌ప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు దుర్మరణం చెంద‌గా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఐదుగురు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడ వద్ద కారు అదుపుతప్పి మొదట డివైడర్‌ను, అనంతరం ఆగి ఉన్న లారీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement