Friday, May 3, 2024

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హీరో నాగార్జున

దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రాజకీయ నాయకులు, సినీ తారలు, సామాన్య ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అక్కినేని నాగార్జున మంగళవారం నాడు ఫస్ట్‌ డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, అందుకోసం ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకోవాలని ఆయన కోరారు. కాగా నాగ్ నటించిన వైల్డ్‌డాగ్‌ మూవీ ఏప్రిల్‌ 2న విడుదల కాబోతుంది. మరోవైపు ప్రవీణ్‌ సత్తారు సినిమా షూటింగ్‌లోనూ ఆయన పాల్గొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement