Thursday, May 2, 2024

తెలంగాణలో మరో న్యాయవాదిపై హత్యాయత్నం

తెలంగాణలో న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య ఘటన మరువకముందే మరో న్యాయవాదిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి బండ్లగూడలో ఉన్న ‘లా’ ట్రిబ్యునల్ కోర్ట్ ఎదురుగా లంచ్ చేస్తుండగా పరమేశ్వర్ రెడ్డి అనే న్యాయవాదిని గొంతు నులిపి దాడి చేసి హత్య చేయటానికి కొందరు దుండగులు ప్రయత్నించారు. ఓ ల్యాండ్ గొడవ విషయంలో చామల మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి లాయర్‌పై దాడి చేయించినట్లు తెలుస్తోంది. తమపై గతంలో కూడా దాడులు చేస్తున్నారని చెప్పినా పోలీసులు స్సందించలేదని, ఇప్పటికే 13 సార్లు ఫిర్యాదు చేశామని బాధితుడు వాపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement