Sunday, May 5, 2024

మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం డైరీ, క్యాలెండరు ఆవిష్కరణ

తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం 2023 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఇవ్వాల (బుధవారం) ఉదయం హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ కాపు సంఘం హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కుల పెద్దలు, నాయకులు, రాష్ట్రంలోని జర్నలిస్టులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మున్నూరు కాపు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ప్రసంగిస్తూ… జర్నలిస్టు ఫోరం డైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించి ఎంతో సమాచారాన్ని జర్నలిస్టులకు అందించారాన్నరు. ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని ప్రశంసించారు. రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో సభ్యత్వం ఉన్న మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం రోజురోజుకు బలోపేతం అవుతుందని అన్నారు. సేవా కార్యక్రమంలో కూడా ఈ జర్నలిస్ట్ ఫోరం ముందు ఉండటం సంతోషించదగ్గ విషయం అని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో జర్నలిస్ట్ ఫోరం మరింత శక్తి వంతగా ఎదిగిమరింత కీలాపాత్ర పోషించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య, TGOS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారులు చింతగట్టు విటల్ బీసీన్ ఛానెల్ మిద్దెల జితేందర్, పెన్ గ్రూప్ PLN పటేల్ ,సమల వేణు,జల్లి సిద్ధయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్వి మహేందర్ కుమార్ పెరుక రమేష్ పటేల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బాల శ్రీనివాస్, గౌరవ సలహాదారులు కొత్త శ్రీనివాస్, రాష్ట్ర మహిళా కన్వీనర్ బండి పద్మ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు కొత్త కృష్ణవేణి, భారతీయ కాపు ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, రాష్ట్ర కోఆర్డినేటర్ జనార్ధన్ అన్ని జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు మరియు జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement