Wednesday, May 1, 2024

ముంబై విమానాశ్ర‌యంలో కోహ్లీ.. అనుష్క‌శ‌ర్మ‌.. వైర‌ల్ గా వీడియో

సెల‌బ్రిటీలు బ‌య‌ట‌క‌నిపిస్తే చాలు మీడియాకి పండ‌గే. ఫొటోలు..వీడియోలు అంటూ తెగ విసిగించేస్తారు. కాగా రీసెంట్ గా
ముంబై విమానాశ్రయంలో కనిపించారు విరాట్ కోహ్లీ..అనుష్క‌శ‌ర్మ‌. వీరు లండన్ ఫ్లయిట్ ఎక్కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ కు వచ్చిన సందర్భంగా తీసిన వీడియోని సామాజిక మాధ్యమాల్లో ఎవరో షేర్ చేశారు. వీరిద్దరూ కలసి ఎయిర్ పోర్ట్ లో కెమెరామెన్లకు ఫోజులిచ్చారు. అనంతరం విమానాశ్రయం గేటు ద్వారా లోపలికి వెళ్లిపోయారు. వీరిద్దరూ క్యాజువల్ వేర్ ధరించి ఉన్నారు. అనుష్క శర్మ ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 కార్యక్రమంలో పాల్గొననుంది. ఈ నెల 25న ఆమె కేన్స్ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉంది. లండన్ నుంచి ఫ్రాన్స్ కు వెళుతుందని తెలుస్తోంది. విరాట్ కోహ్లీ మరికొందరు టీమిండియా క్రికెటర్లతో కలసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం లండన్ వెళ్లాల్సి ఉంది. అతడు అనుష్కతో కలసి ఫ్రాన్స్ నుంచి భారత్ కు తిరిగొస్తాడా.. లేక లండన్ చేరుకుంటారా అన్నది తెలియదు. జూన్ 7 నుంచి టెస్ట్ ఛాంపియన్ షిప్ జరగనుంది. కోహ్లీతో పాటు మహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, అక్సర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ మొదటి బ్యాచ్ గా లండన్ వెళ్లే వారిలో ఉన్నారు. వీరు లండన్ కాదని, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళుతున్నారని ఓ అభిమాని తన అభిప్రాయాన్ని షేర్ చేశారు. అస‌లు విష‌యం ఏంట‌నేది మాత్రం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement