Thursday, May 2, 2024

శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహాసముద్రం’ సినిమా దసరా బరిలో నిలిచింది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధానమైన పాత్రలను పోషించగా వారి సరసన హీరోయిన్‌లుగా అదితీ రావు హైదరీ .. అనూ ఇమ్మాన్యుయేల్ అలరించనున్నారు.

ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ, రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ వార్త కూడా చదవండి: చిన్నపిల్లాడిలా మారిన రియల్ హీరో

Advertisement

తాజా వార్తలు

Advertisement