Saturday, April 27, 2024

ఆకట్టుకుంటున్న ‘ముగ్గురు మోనగాళ్లు’ మూవీ ట్రైలర్

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధానమైన పాత్రలు పోషిస్తున్న ‘ముగ్గురు మోనగాళ్లు’ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రధాన పాత్రధారులలో ఒకరికి వినిపించదు … ఒకరికి కనిపించదు .. మరొకరు మాట్లాడలేరనే విషయాన్ని పోస్టర్ ద్వారానే స్పష్టం చేశారు.

ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కామెడీ, సస్పెన్స్ అంశాలను కలిపి అందించిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నగరంలో జరుగుతున్న వరుస హత్యలు, ఈ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయనే ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇటీవల కరోనాతో మరణించిన సినీ జర్నలిస్ట్ టీఎన్నార్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ ఈ మూవీకి హైలైట్‌ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement