Friday, May 17, 2024

ఎంటెక్‌, ఎంఫార్మ్‌ 2744 సీట్లు భర్తీ.. రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : టీఎస్‌ పీజీఈసెట్‌ రెండో విడత సీట్లను కేటాయించారు. ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మ్‌, ఎంఆర్క్‌ కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్లు 6248 ఉండగా వీటిలో 2744 సీట్లను కేటాయించారు. 3270 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోగా అందులో 2744 మంది విద్యార్థులు మాత్రమే సీటు పొందారు. సీటు పొందిన విద్యార్థులు ఫీ చలాను తీసి ఈనెల 31 నుంచి నవంబర్‌ 3వ తేదీలోపు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరై కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాలని సూచించారు. మొదటి ఫేజ్‌లో 8815 కన్వీనర్‌ కోటా సీట్లలో 4731 మందికి కేటాయించగా అందులో ఇంతవరకు 2872 మంది విద్యార్థులు మాత్రమే కాలేజీల్లో చేరారు. మొదటి విడతలో మిగిలిన 6248 సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా 2744 సీట్లు భర్తీ అయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement