Monday, April 29, 2024

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. మంగళవారం న్యూఢిల్లీలో ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి  అభినందనలు తెలిపారు.

న్యాయ వ్యవస్థలో నజీర్‌కు ఉన్న అపారమైన అనుభవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని విజయసాయి ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా సేవలందించి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న బిశ్వభూషన్ హరిచందన్‌కు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement