Monday, April 29, 2024

సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన ఎంపీ రఘురామ

ఏపీ సీఎం జగన్‌కు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ‘నవ సూచనలు’ పేరిట బుధవారం నాడు తొమ్మిదో లేఖ రాశారు. ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద పోలీసు కేసుల నమోదును ఆపాలని ఆయ‌న కోరారు. ఎందుకంటే ఆ చ‌ట్టం ద్వారా.. సామాజిక మాధ్య‌మాల‌ కార్యకలాపాలపై ఇష్టం వ‌చ్చిన‌ట్లు కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

నిజానికి ఈ చ‌ట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినప్ప‌టికీ పోలీసులు ఆ సెక్షన్‌పైనే కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీంకోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. ఎవరైనా త‌న‌ ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేస్తే లేదా మెసేజింగ్ యాప్‌లలో వాడుకుంటే వారిని పోలీసు స్టేషన్‌లకు పిలుస్తున్నారని రఘురామ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఇటువంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా చూసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఈ వార్త కూడా చదవండి: ఏపీ సర్కారుకు హైకోర్టు హెచ్చరిక

Advertisement

తాజా వార్తలు

Advertisement