Friday, May 3, 2024

బాంద్రా కోర్టులో ఎంపీ నవనీత్ కౌర్ కు చుక్కెదురు

హనుమాన్ చాలీసా వివాదంలో అమరావతి పార్లమెంట్ సభ్యురాలు, సినీనటి నవనీత్​ కౌర్ దంపతులకు బాంద్రా కోర్టులో చుక్కెదురైంది. బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు నవనీత్ కౌర్ దంపతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడి విధించింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతాననే కౌర్ ప్రకటనతో శనివారం దుమారం రేగిన నేపథ్యంలో వారిని పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement