Tuesday, April 30, 2024

కిష‌న్ రెడ్డిపై ఎంపీ మాలోతు క‌విత ఫైర్‌

బయ్యారం ఉక్కు పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గుచేటని ఎంపీ మాలోతు కవిత ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రంలోనే పుట్టారా? అని ప్రశ్నించారు. బయ్యరం ఉక్కుపై చేసిన ప్రకటనతో తెలంగాణ మీద కిషన్ రెడ్డి కి ప్రేమ లేదని తేలిపోయిందని అన్నారు. సంక్రాంతి పండగ ముందు వచ్చే బుడబుక్కల వాళ్లలా బీజేపీ నేతలు వస్తున్నారని యెద్దేవా చేశారు. గిరిజనులు అంటే తమకు గిట్టదా.. గిరిజనుల ఆశలకు ఉరి వేశారని… గిరిజనులే బీజేపీ ని పాతర వేస్తారని హెచ్చరించారు. కిషన్ రెడ్డి ఒక్క ప్రకటనతో దద్దమ్మ అని తేలిపోయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎంపీ మాలోతు కవిత డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement