Monday, April 29, 2024

Delhi | కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఎంపీ కృష్ణయ్య భేటీ..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీసీ బిల్లు, వెనుకబడిన వర్గాల డిమాండ్ల సాధనకు సహకరించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కోరారు. గురువారం ఆయన నేతృత్వంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి- ఢిల్లీ ఇంఛార్జి కర్రి వేణుమాధవ్ తదితరులు ఖర్గేను కలిసి చర్చలు జరిపారు. బెంగళూరులో నిర్వహించిన విపక్షాల భేటీలో జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పార్లమెంట్ సమావేశాల్లోనూ బీసీ బిల్లు, బీసీల డిమాండ్లపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణయ్య ఖర్గేను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement