Sunday, May 5, 2024

రిలీజైన 50 రోజుల త‌ర్వ‌తే ఓటీటీలోకి సినిమాలు.. టాలీవుడ్ నిర్మాతల నిర్ణ‌యం..

ఓటీటీలోకి తెలుగు సినిమాల ఎంట్రీపై టాలీవుడ్ నిర్మాత‌లు బుధ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. థియేట‌ర్ల‌లో విడుద‌లైన 50రోజుల త‌ర్వాత మాత్ర‌మే సినిమాల‌ను ఓటీటీకి ఇవ్వాల‌ని తేల్చారు. ఈ మేర‌కు బుధ‌వారం జరిగిన భేటీలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌కటించారు. అయితే జులై 1 త‌ర్వాత ఒప్పందాలు జ‌రిగే సినిమాల‌కే ఈ నిబంధ‌న వ‌ర్తింప‌జేయాల‌ని కూడా నిర్మాత‌లు నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

ఓటీటీలోకి త్వ‌రిత‌గితిన సినిమాలు విడుద‌ల అవుతుండ‌టంతో అగ్ర హీరోల‌కు భారీ న‌ష్టం జ‌రుగుతోంద‌ని, వారి ఇమేజీ కూడా త‌గ్గిపోతోంద‌ని టాలీవుడ్ నిర్మాత బ‌న్నీ వాసు ఇంత‌కుముందు అన్నారు. దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకునేందుకు నిర్మాత‌లు ఇవ్వాల భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది. బ‌న్నీ వాసు రిక్వెస్ట్ మేర‌కే టాలీవుడ్ నిర్మాత‌లు ఈ కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు స‌మాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement