Thursday, May 2, 2024

సినీ తార‌లు వ‌స్తుంటారు.. పోతుంటారు ..డీకే శివ‌కుమార్

క‌ర్ణాట‌కలో త్వ‌ర‌లో జ‌రిగే ఎల‌క్ష‌న్స్ లో సీఎం బ‌స‌వ‌రాజ్ బొమ్మైకి మ‌ద్ద‌తు ఇస్తున్నాట్లు ప్ర‌కటించాడు క‌న్న‌డ స్టార్ కిచ్చా సుదీప్. బసవరాజ్ బొమ్మైతో వ్యక్తిగతంగా తనకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మీడియాను కలిసిన కిచ్చా సుదీప్.. నేను ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీ కోసమో.. డబ్బు కోసమో ఇక్కడికి రాలేదు. ఒక వ్యక్తి కోసమే నేను ఇక్కడకు వచ్చాను. నాకు సీఎం (బొమ్మై)పై చాలా గౌరవం ఉంది.అందుకే ఆయనకు నా పూర్తి మద్ధతు ప్రకటిస్తున్నాను. అయితే నేను రాజకీయాల్లోకి ప్రవేశించడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

నేను ఇంకా చాలా సినిమాలు చేయాల్సి ఉంది. అప్పుడే నా ఫ్యాన్స్ కూడా సంతోషిస్తార‌న్నారు. సుదీప్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం బసవరాజ్ బొమ్మై.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్ధతుగా సుదీప్ ప్రచారం చేస్తారని వెల్లడించారు. దీని కోసం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. సుదీప్ మద్ధతు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతోందని వ్యాఖ్యానించారు.కిచ్చా సుదీప్‌ బీజేపీకి మద్ధతు ప్రకటించడంపై కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు డీకే శివకుమార్ స్పందించారు. సినిమాలు, రాజకీయాలు రెండూ వేర్వేరు అని చెప్పారు. కిచ్చా సుదీప్ బీజేపీకి మద్ధతు ప్రకటించడం ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. చాలా మంది సినీ తారలు వస్తుంటారు.. పోతుంటారని వ్యాఖ్యానించారు. సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని డీకే శివకుమార్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement