Thursday, May 2, 2024

కన్నకూతురే కోడలైంది.. దిమ్మతిరిగే ట్విస్ట్!

చైనాలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మరో గంటలో పెళ్లనగా కాబోయే కోడలే తన కన్న కూతురని వరుడి తల్లికి తెలిసింది. కానీ ఆ పెళ్లి ఆగిపోలేదు. ఎందుకో తెలియాలంటే ఈ స్టొరీలోకి వెళ్ళాల్సిందే.. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన గత నెల 31న జియాంగ్సు ప్రావిన్స్‌లోని సుజౌ ప్రాంతంలో చోటు చేసుకుంది. పెళ్లికి మరి కొద్ది సమయం ఉందనగా.. కాబోయే అత్తగారికి వధువు చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కనిపించింది. ఆ పుట్టుమచ్చను చూడగానే వరుడు తల్లికి 20 ఏళ్ల గతం గుర్తుకువచ్చింది.

గతంలో తప్పిపోయిన తన కుమార్తె చేతి మీద కూడా ఇలాంటి మచ్చే ఉండేదని ఆమె గుర్తు చేసుకుంది. వెంటనే వధువు తలిదండ్రులను అరా తీసింది. తమకి పిల్లలు లేకపోవడంతో 20 ఏళ్ల క్రితం తమకి ఓ చిన్నారి దొరికిందని.. వధువు తమకి పెంపుడు కూతురని చెప్పుకొచ్చారు. దొరికిన ఆ పాపను తమతో తీసుకువచ్చి..పెద్దచేసి విద్యాబుద్ధులు నేర్పించి.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి నిశ్చయించమని చెప్పారు. ఇది విని షాకైన వరుడు తల్లి.. ఆ వధువు తన కుమార్తెనని గుర్తించింది. అటు కన్నతల్లిని చూసిన ఆ అమ్మాయి కూడా కన్నీళ్లపర్యంతం అయ్యింది. ఈ సన్నివేశం అక్కడున్న అందరిని కలిచివేసింది.

అయితే ముందుగా అనుకున్న ముహుర్తానికే ఈ వివాహం జరిగింది. అదేంటి అన్నచెల్లలకి ఎలా వివాహం చేశారని అనుకోవచ్చు. కానీ ఇక్కడే దిమ్మతిరిగే ట్విస్ట్ ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ చిన్నారి తప్పిపోవడంతో వారు మరో అబ్బాయిని దత్తత తీసుకున్నారు. అతడే ఈ పెళ్లి కుమారుడు.. వారిద్దరూ రక్తం పంచుకుపుట్టిన వారు కాకపోవడంతో వారికి వివాహం జరిపించారు. ఈ సంఘటన పెళ్ళికి వచ్చిన అతిధులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్త జంటను అతిథులు ఆశీర్వదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement